KMR: జుక్కల్ సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై MLA లక్ష్మీకాంతారావు గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్తో కలిసి వివిధ శాఖల పురోగతిపై చర్చించారు. ముఖ్యంగా వైద్యం, గృహ నిర్మాణం, సాగునీరు, అటవీ, పర్యాటక రంగాల్లో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.