MLG: ఏటూరునాగారం పట్టణ కేంద్రంలో సుమారు కోటి రూపాయల వ్యాయాయంతో నిర్మాణం చేపట్టిన ఆధునిక కూరగాయల మార్కెట్ పనులను రాష్ట్ర మంత్రి సీతక్క ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నేతలు, అధికారులు ఉన్నారు.