NRML: సారంగాపూర్ మండలంలోని కౌట్ల (బి) గ్రామ రైతు పరస్పర సహకార సంఘం సభ్యులు, తమ పంటలైన జొన్నలు, మొక్కజొన్నల కొనుగోలు కోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ, నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఇప్పటికే సంబంధిత అధికారులు అందరికీ వినతి పత్రాలు సమర్పించినట్లు వారు తెలిపారు.