మేడ్చల్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతూ, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు పరిచే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం వివిధ సంక్షేమ సంఘాల ప్రతినిధులు వచ్చి ఆయనకు వినతి పత్రాలు అందజేశారు. వివిధ విభాగాల అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.