MNCL: జిల్లా కేంద్రంలోని రాళ్ళవాగులో మునిగి ఒక యువకుడు మరణించాడు. స్థానిక ఎన్టీఆర్ నగర్కు చెందిన చింతల రాకేష్ అనే యువకుడు ఆదివారం ఉదయం సమీపంలోని రాళ్ళవాగులో చేపల వేటకు వెళ్లాడు. వాగులో నీటి ఉద్దృతి అధికంగా ఉండడంతో రాకేష్ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.