వరంగల్ జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రారంభమైనట్లు DEO రంగయ్య తెలిపారు. మొదటి రోజు 9,485 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా, 9,475 మంది హాజరై 99.8 శాతం హాజరు నమోదైంది. 10 మంది మాత్రమే గైర్హాజరయ్యారు. పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని DEO పేర్కొన్నారు.