KRNL: ఎవరైనా గంజాయి సాగు చేసినా, అక్రమంగా నిల్వ ఉంచినా చట్టపరంగా చర్యలు తప్పవని డీఎస్పీ వెంకట రామయ్య హెచ్చరించారు. ఆలూరులో ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గంజాయి సాగు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆస్పరి, డేగులపాడు ప్రాంతాల్లో గంజాయి లభ్యమైన ఘటనను ప్రస్తావిస్తూ.. అక్కడ ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.