NDL: పాములపాడు మండలం మద్దూరులో శ్రీ శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి దేవాలయం పునర్మానానికి నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య భూమి పూజ నిర్వహించారు. దేవాలయ కమిటీ రూ.14 లక్షల మ్యాచింగ్ గ్రాంట్, కూటమి ప్రభుత్వం రూ. 56 లక్షల సీజీఎఫ్ గ్రాంట్ మంజూరు చేసింది. మొత్తం రూ. 70 లక్షలతో శ్రీ ఈశ్వర వీరభద్ర స్వామి నూతన దేవాలయ పునర్మాణానికి పూజ కార్యక్రమం నిర్వహించారు.