KRNL: ఆదోని జిల్లా సాధన కోసం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలను ఇవాళ ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ సందర్శించారు. ఇవాళ ఈ దీక్షలు 119వ రోజుకు చేరుకోవడం ఆదోని చరిత్రలో ఆల్ టైం రికార్డుగా నిలిచిందని పేర్కొన్నారు. ఆదోని జిల్లా సాధన పోరాటానికి పూర్తి మద్దతు ఇస్తున్న ప్రజలకు నూర్ అహ్మద్ కృతజ్ఞతలు తెలిపారు.