ఏపీ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం అభినందన సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘నేను 25 ఏళ్లు అమెరికాలో ఉన్నాను. ఇండియా నుంచి ఎవరు వెళ్లిన జయరాం దగ్గరికి వెళ్తారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను అనేక దేశాల్లో నిర్వహించారు’ అని పేర్కొన్నారు.