అన్నమయ్య: చిట్వేల్ మండలంలో సోమవారం నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంఈవోలు కాజా మొహిద్దిన్, ఈశ్వరయ్య తెలిపారు. మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 513 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, వైద్య సేవలు, తాగునీటి సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.