NTR: విజయవాడ నగరపాలక సంస్థ కళ్యాణ మండపంలోని టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కిట్లను ఎంపీ కేశినేని చిన్ని మహిళలకు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రంజాన్ మాసం దానధర్మాలకు, పరస్పర ప్రేమాభిమానాలకు ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.