MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలు భాగంగా ఆరవ రోజు పలు హోటల్స్ను మున్సిపల్ పాలకవర్గం సభ్యులు, అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని హోటల్లు, టిఫిన్ సెంటర్లలో నాణ్యత గల ఆహారాలు విక్రయించే విధంగా ఈ తనిఖీలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. హోటల్లలో శుభ్రత పాటించాలని సూచించారు.