PDPL: మంథని JNTU ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జాతీయ గ్రీన్ కార్ప్స్ కార్యక్రమాలను రాష్ట్ర ప్రాజెక్టు అధికారి విద్యా సాగర్ పరిశీలించారు. ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థుల పాత్ర కీలకమని చెప్పారు. ఈ మేరకు విద్యార్థులు మట్టి విగ్రహాలు, సీడ్ బాల్స్, బట్ట సంచుల తయారీలో పాల్గొన్నారు.