MHBD: రైతు భరోసా పథకం 2025-26 యాసంగి సీజన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గూడూరు మండల AO అబ్దుల్ మాలిక్ తెలిపారు. గత నెల 28 లోపు డిజిటల్ సంతకం అయిన రైతులు మాత్రమే ఈసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో రైతు భరోసా పథకం లబ్ధి పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని వివరించారు. మరిన్ని వివరాలకు AO కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.