MNCL: తాండూరు మండలం కిష్టంపేటలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి కామదహనం చేస్తుండగా ఉరడి మల్లేశ్ ప్రమాదవశాత్తు మంటల్లో పడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. బెల్లంపల్లి 108 సిబ్బంది నరేశ్, సంపత్ ఘటనా స్థలికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించి, బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.