ADB: బోథ్ మండలంలోని దన్నూరు గ్రామానికి చెందిన నరసయ్య అనే యువకుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడుతున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు లొకేషన్ ఆధారంగా బాధితుడిని సోమవారం కాపాడారు. తండ్రి ఇస్తారి మందలించాడని కుమారుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడని వెల్లడించారు. క్షణికావేశంలో యువకులు తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకూడదని CI గురుస్వామి సూచించారు.