HNK: కాజీపేటలోని డివిజన్ ముఖ్య నాయకులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్థానిక సమస్యల పరిష్కారానికై పోరాడాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 6గ్యారంటీలు, 420హామీల అమలు కోసం ప్రజల తరఫున పోరాటం చేయాలని పేర్కొన్నారు.