WGL: నెక్కొండ (M)కేంద్రంలోని వెంకటాపురం గంగాదేవి తండాలో మంగళవారం దుర్గమ్మ బోనాల పండుగ సందర్భంగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు.