KMM: వైరా ప్రాంతంలో అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో సర్వే చేయించి, ఎకరాకు తగిన పరిహారం ప్రకటించాలి. పంట బీమా వర్తింపజేయడంతో పాటు, పాత రుణాలపై వడ్డీ మాఫీ చేసి, కొత్తగా వడ్డీ లేని రుణాలు అందించాలని కోరారు.