PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ లింగాపూర్ గ్రామంలో ఇవాళ సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 103 మందికి బీపీ, షుగర్ తదితర పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. వేసవికాలంలో ప్రజలు తీసుకోవలసిన ఆరోగ్య జాగ్రత్తలను వైద్యులు వివరించారు. సింగరేణి అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.