SRPT: పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనంలో మంటలు చెలరేగిన ఘటన హుజూర్ నగర్ పట్టణంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణంలోని ఓ దుకాణం వద్ద పార్కింగ్ చేసిన, రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీంతో అక్కడే ఉన్న స్థానికులు గమనించి మంటలను ఆర్పారు.