నిజామాబాద్ జిల్లాలోనీ ఆర్మూర్ మండలం ఫతేపూర్లో మానవ హక్కుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సర్పంచ్ ప్రణుక-నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సామాన్యులకు చట్టాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.