MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం BFAC సమావేశం నిర్వహించారు. BFAC ఛైర్మన్ రౌతు సత్తయ్య, ADA రాజ నరేందర్ హాజరయ్యారు. సమావేశంలో రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచి, వ్యవసాయ అభివృద్ధిని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు.