MDK: రేవంత్ రెడ్డి ప్రభుత్వం దేవాలయాలపై దౌర్జన్యాలకు పాల్పడుతోందని హరీష్ రావు విమర్శించారు. కోకాపేటలో ఉన్న విశాఖ శారదా పీఠం రాజశ్యామల అమ్మవారి ఆలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల చర్యలను ఖండించారు. నిత్యాన్నదానం, కేసీఆర్ హయాంలో నిర్మించిన దేవాలయాలను లక్ష్యంగా చేసుకోవడం తగదని హరీష్ రావు పేర్కొన్నారు.