ADB: జిల్లాలో ఆన్లైన్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ సోమరాజేశ్వర్ ఇవాళ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన ఆన్లైన్ ఎంట్రీలు, FRS తదితర విద్యా సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్లో ఉన్న ఎంట్రీలను వెంటనే ముగించే దిశగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.