NGKL: కల్వకుర్తి పట్టణంలోని గచ్చుబావి వద్ద ఉన్న శివాలయంలో సోమవారం సాయంత్రం జరిగిన మహా రుద్రాభిషేకం కార్యక్రమంలో బీజేపీ నేత తల్లోజు ఆచారి పాల్గొన్నారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఎంతో పురాతనమైన గచ్చుబావిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని తెలిపారు.