WNP: వరి కోత మిషన్లో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం పెద్దమందడి మండలంలో చోటు చేసుకున్నది. స్థానికుల వివరాలు.. అంకూరు గ్రామానికి చెందిన రాకాసి శ్రీనివాస్ రెడ్డి (45) జంగమయ్య పల్లి గ్రామ సమీపంలోని పొలంలో పంటను కోసే క్రమంలో ప్రమాదవశాత్తు మిషన్లో పడి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.