SRPT: ‘ప్రజావాణి’ ఫిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరై పిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు.