AP: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతర్జిల్లాల బదిలీలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. కొత్త గైడ్లైన్స్ ప్రకారం బదిలీలు ఉంటాయని పేర్కొంది. ప్రొవిజనల్ సీనియారిటీ, క్లియర్ వేకెన్సీ ఆధారంగా బదిలీ అవుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.