హీరోయిన్ కీర్తి సురేష్కు అరుదైన గౌరవం దక్కింది. ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిసెఫ్ ఇండియా విభాగానికి సెలబ్రిటీ అడ్వకేట్గా ఎంపికైంది. పిల్లల మానసిక ఆరోగ్యం, హక్కుల గురించి ఆమె పని చేయనున్నట్లు యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింథియా వెల్లడించారు. దీనిపై కీర్తి సురేష్ స్పందించింది. ఇది తనకు దక్కిన గొప్ప గౌరవమని హర్షం వ్యక్తం చేసింది.