WNP: పెబ్బేరు మండలంలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి అదృశ్యమైన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత సుగూరుకి చెందిన చనమోని రమేష్ సోమవారం పొలం నుంచి ఇంటికి తిరిగి రాగా భార్య కవిత, కూతురు ఐశ్వర్య (5), కొడుకు శివం తేజ్ (3) కనిపించలేదు. తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించకపోవడంతో రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.