NRPT: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ప్రోత్సహించి, వారికి మంజూరైన ఇళ్లను త్వరితగతిన నిర్మించుకునేలా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నర్వ మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, నర్వ యాస్పిరేషన్ బ్లాక్పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇళ్ల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.