సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో తలెత్తిన త్రాగునీటి సమస్యను కౌన్సిలర్ భవాని పరిష్కరించారు. వార్డులో నీటి కొరత ఉందన్న ప్రజల విన్నపంపై ఆమె తక్షణమే స్పందించి, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డు సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని వార్డు ప్రజలకు కౌన్సిలర్ పిలుపునిచ్చినారు.