SDPT: దుబ్బాక మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో గురువారం ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ కుమార్ తెలిపారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ సభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు.