NRML: మామడ మండలం పరిమండల్ గ్రామంలోని భీమన్న ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గురువారం పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ, గ్రామస్తులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండాలని అన్నారు. వీరి వెంట స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.