MBNR: జిల్లా కేంద్రంలోని పలు వాణిజ్య సంస్థలలో బుధవారం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాణిజ్య సంస్థలలో అక్రమంగా వినియోగిస్తున్న 11 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఎనిమిది కేసులు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.