NLG: పదవ తరగతి పరీక్షల నిర్వహణపై నల్లగొండ డివిజన్ ఇన్విజిలేటర్లకు అశోక గార్డెన్స్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి మాట్లాడుతూ.. పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా జరపాలని సూచించారు. ఎక్కడా మాస్ కాపీయింగ్కు తావులేకుండా, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఇన్విజిలేటర్లు చర్యలు తీసుకోవాలన్నారు.