NZB: కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో గ్రామ పంచాయితి కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారులకు కమ్మర్ పల్లి ఎంఆర్వో ప్రసాద్, గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలందర్ చేతుల మీదుగా నేడు చెక్కులను పంపిణి చేసారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపాలన చేస్తూ నిరుపేద ప్రజలకోసం వారి సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేయడం జరుగుతుంది అన్నారు.