మహబూబ్నగర్ రూరల్ మండలం ధర్మపురి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బి.రాజు గౌడ్ ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహబూబ్నఃగర్ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.