ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం వివరాలను జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడ 80.41%, సిరికొండ 87.04%, ఇంద్రవెల్లి 76.88%, ఉట్నూర్ 71.34%, నార్నూర్ 80.8%, గాదిగూడలో 82.33% నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సరాసరి ఓటింగ్ 77.52 శాతం నమోదైందని పేర్కొన్నారు.