SRD: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగు మూడవ వార్డులో రూ. 79 లక్షలతో అభివృద్ధి పనులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్య క్రమంలో సమస్యలను పరిష్కరిస్తూ, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని తెలిపారు.