MNCL: జిల్లాలో ఎంపిక చేసిన 53 పాఠశాలల్లో ఈనెల 25, 26, 27 తేదీల్లో ఎఫ్ఎల్ఎన్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. సోమవారం మంచిర్యాలలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నియమ, నిబంధనలు, సమయపాలన తప్పనిసరిగా పాటించాలని సూచించారు.