HYD: సికింద్రాబాద్ గురుద్వారాలో వీర్ బాల్ దివస్ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం, మన స్వేచ్ఛ కోసం వందల సంవత్సరాల క్రితం అనేక మంది ప్రాణాలు అర్పించారని, వారిని స్మరించుకోవడం మన కర్తవ్యం అని తెలిపారు.