SRPT: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తలంబ్రాలను భక్తుల ఇంటికే చేర్చేందుకు కోదాడ ఆర్టీసీ ఏర్పాట్లు చేసిందని డీఎం శ్రీనివాసరావు ఈ రోజు తెలిపారు. తలంబ్రాల బియ్యం కావాల్సిన భక్తులు రూ. 151 చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్టీసీ కల్పిస్తున్న ఈ విశిష్ట సేవను భక్తులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.