ADB: బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామంలో జొన్న, మొక్క జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పడు చేయాలని కోరుతూ మర్లపల్లి రైతులు సోమవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రాథోడ్ షీలాభాయి అంబాజి, రైతులు ఉన్నారు.