HYD: హోలీ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో ఇవాళ మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. శాంతిభద్రతల దృష్ట్యా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లను మూసివేయాలని సీపీ సజ్జనార్ ఆదేశించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.