KNR: తిమ్మాపూర్ మండలం LMD కాలనీకి చెందిన సుధాకర్, చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన అనిల్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు 6 నెలల క్రితం తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నారు. LMD పోలీసులు మంగళవారం రెండు ఫోన్లను గుర్తించి, బాధితులకు అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నవారు సీఐఈఆర్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు.