ADB: ఈ నెల 6న బజరహత్నూర్ మండలం పిప్పిరీ గ్రామంలో CM పర్యటన సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షి షా, SP అఖిల్ మహజాన్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభ ప్రాంగణం, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.