NRPT: కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా పట్టణ అభివృద్ధి జరగాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. గురువారం ఆత్మకూరు మున్సిపాలిటీలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అభివృద్ధికి ఎన్ని నిధులైనా తీసుకొస్తానని, అన్ని వార్డుల్లో సమానంగా పనులు జరగాలని అధికారులను ఆదేశించారు.